Monday, 17 February 2014

రెండుగా చీలి పోయిన మీడియా


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. తెలంగాణ విభ‌జ‌న అంశం రాష్ర్టంలో అన్ని వ‌ర్గాల‌ను, సంస్థ‌ల‌ను రెండుగా చీల్చింది. అయితే దేశంలోనే అత్య‌ధికంగా ఛాన‌ల్స్‌ ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీడియా.. ఇప్పుడు ప్రాంతాల వారిగా ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌నటంలో సందేహం లేదు. త‌మిళ‌నాడు మాదిరిగానే రాజ‌కీయ నేప‌థ్యంలో మీడియ వ్య‌వ‌హిరించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయమైంది. తెలంగాణ ఉద్య‌మం మొద‌ల‌వ‌గానే ఆ ప్రాంతానికి చెందిన మీడియా సంస్థ‌లు రాష్ర్ట సాధ‌నే ల‌క్ష్యంగా ప‌నిచేశాయి. అదే స‌మ‌యంలో సీమాంధ్ర‌కు చెందిన మీడయా కూడా ఉద్య‌మాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాయి. అయితే తెలంగాణ ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించ‌గానే మీడియా రెండుగా చీలిపోయింది. విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా సీమాంధ్ర‌లో ఉద్య‌మం మొద‌ల‌వ‌గానే, త‌మ ప్రాంతాన్ని ప్ర‌తిబింబించడం మొద‌లు పెట్టాయి. సీమాంధ్ర‌, తెలంగాణ‌.. ఇలా ఏ ప్రాంతానికి చెందిన యాజ‌మాన్యాలు ఆ ప్రాంత ఉద్య‌మాల‌ను, పరిస్థితుల‌ను ప్రసారం చేయ‌టం గ‌మ‌నించాల్సిన విష‌యం. ఆగ‌స్టులో ప్రారంభ‌మైన మెట్రో ఇండియా, న‌మ‌స్తే తెలంగాణ‌కు అనుబంధ ప‌త్రిక‌గా అర్థం చేస‌సుకోవ‌చ్చు. అయితే దీని ప్రారంభ‌ స‌భ‌లో బీజేపీ నేత‌ వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ.. ప‌త్రిక విశ్వ‌స‌నీయ‌త పొందాలంటే రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని అన్నారు. అలాగే సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. న‌మ‌స్తే తెలంగాణ రాజ‌కీయ అవ‌స‌రాల నుంచి పుట్టుకొస్తే, మెట్రో ఇండియా ఇంగ్లీష్ జ‌ర్న‌లిజం మీద రాజంకున్న మ‌మ‌కారంతోటి పుట్టింద‌ని తెలిపారు. అయితే ప్రాంతాల‌కు అతీతంగా, నిజాల‌ను నిగ్గు తేల్చిన‌పుడే పత్రిక ప్ర‌జలంద‌రి విశ్వ‌నీయ‌త చూర‌గొంటుంద‌ని అన్నారు. ఇక టీఆర్ ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్‌, ప‌త్రిక ఎండీ, సీఎల్ రాజం మాట్లాడుతూ.. హైద‌రాబాద్ ఘ‌న‌త‌ను, ఈ ప్రాంత సంస్కృతిని దేశవ్యాప్తంగా చాటి చెప్ప‌నున్న‌ట్లు తెలిపారు. ఏదైతేనేం.. త‌మ ప్రాంతీయ‌ను చాటిచెప్ప‌టానికి పత్రిక ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌టంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌లో మీడియా ప్రాంత‌, కుల‌, వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ని కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌వ‌చ్చు. అది టీవీ ఛానల్‌లో కావ‌చ్చు, ప్ర‌తిక‌ల్లో కావ‌చ్చు. తెలుగు దేశం పార్టీకి మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నది క‌మ్మ స‌మాజానికి చెందిన‌ది కాగా, కాంగ్రెస్‌, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ కు మ‌ద్ధ‌తిస్తున్న‌ది రెడ్డి మీడియా అని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అలాగే వెలమ వ‌ర్గానికి మ‌ద్ధ‌తిస్తున్న మీడియాలో హెచ్ఎమ్ టీవీ, సూర్య పత్రికలు లేక‌పోలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చాలా వ‌ర‌కు మీడియాకు రాజ‌కీయ నాయ‌కులే య‌జ‌మానులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మీడియా ప‌లుకుబ‌డి ఉప‌యోగించి వారు రాజ‌కీయాల్లో చక్రం తిప్పాల‌నుకోవ‌టం గ‌మ‌నార్హం. జీ24 గంట‌లు ఛానల్ రాష్ర్ట కాంగ్రెస్ అధ్య‌క్షుడి కుటుంబానికి చెందిన‌ది తెలిసిన విష‌య‌మే. అలాగే మ‌రో ప‌త్రిక‌, ఛాన‌ల్ కూడా ప‌రోక్షంగా ఒక ముఖ్య‌నేత న‌డుపుతున్నారు. ఏ టీవీ, ఐ న్యూస్ లాంటివి ముఖ్య‌మంత్రి కుటుంబానికి చెందిన వారి చేతుల్లోకి మారడం మ‌రో ప‌రిణామం. అలాగే క‌మ్యూనిస్టుల గ్రూపుకు చెందిన 10 టీవీ ప్రస‌సారాలు ప్రారంభించింది. లెఫ్ట్ పార్టీకి చెందిన టీవీ 99 కూడా త్వ‌రలో రానుంది. ఈ నాయ‌కుల యాజ‌మ‌న్యంలో ఉన్న మీడియా వారి వారి విష‌యాల‌ను ప్ర‌సారం చేయ‌టంలో నిమ‌గ్న‌మైంది. 16 నెల‌లుగా జైల్లో ఉన్న జ‌గ‌న్ కున్న ధీమా కూడా త‌న‌కున్న మీడియా ద్వారా ప్ర‌భావం చూప‌వ‌చ్చున‌నుకోవ‌ట‌మే. పత్రిక‌ల విష‌యానికొస్తే కాస్త భిన్న‌మైన ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. గ‌త 30 ఏళ్లుగా మొద‌టి స్థానంలో కొన‌సాగుతున్న ఈనాడుకు ఇప్ప‌టికి కూడా తెలంగాణ‌లో ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. న‌మస్తే తెలంగాణ ప‌త్రిక వ‌చ్చినా అంత ప్ర‌భావం చూప‌లేక పోయింది. 2013లో ఏబీసీ వెలువ‌రించిన వివ‌రాల ప్ర‌కారం.. కేవ‌లం తెలంగాణ ప్రాతంలో ఈనాడుకు 7,67,980 స‌ర్క్యులేషన్ ఉంది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనే దాదాపు ల‌క్ష వ‌ర‌కు స‌ర్క్యులేష‌న్ ఉంది. అలాగే సాక్షికి 4,80,100 స‌ర్క్యులేష‌న్ ఉండ‌టం గ‌మ‌నార్హం. 2011లో ప్రారంభ‌మైన న‌మ‌స్తే తెలంగాణ ఈ రెండు పత్రికల‌ను అధిగ‌మించలేక పోయింది. అయ‌తే మీడియా విభ‌జ‌న అయిన త‌ర్వాత పాఠ‌కులు అభిప్రాయం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక టీ న్యూస్‌, హెచ్ఎంటీవీ, వీ6 లాంటి తెలంగాణ‌కు చెందిన ఛాన‌ల్‌లు ప్రారంభ‌మ‌య్యాక ఆ ప్రాంత ప్ర‌జ‌ల అభిరుచులు మారిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ మీడియా హ‌వా మొద‌లైంద‌ని అంటున్నారు. అయితే మీడియా యాజ‌మాన్యాలు కూడా ఎవ‌రికి వారు స‌మ‌ర్థించుకుంటున్నారు. త‌మ ప్రాంత స‌మ‌స్య‌ల‌ను, ప్ర‌జానీకాన్ని ప్ర‌తిబింబించ‌డం త‌మ మొద‌టి విధి అని చెబుతున్నారు. న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్ అల్లం నారాయ‌ణ మాట్లాడుతూ.. త‌మ పత్రిక ఏర్ప‌డ‌ట‌మే తెలంగాణను ప్ర‌తిబింబించేందుక‌ని, అందుకే తాము ఆ ప్రాంతానికి చెందిన విష‌యాల‌కు ప్రాధాన్య‌తనిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణ నుంచి గ‌తంలో మీడియా వేళ్లూనుకోక పోవ‌టానికి కార‌ణం అడిగితే.. తెలంగాణ‌లోని పెత్తందార్లు మీడియా లాభ‌సాటి వ్యాపారం కాక‌పోవ‌టం వ‌ల్ల దానికి దూరంగా ఉన్నారు. విశ్లేష‌ణ‌లు ఎలా ఉన్నా.. ప్రాంతాల వారిగా మీడియా కూడా రెండుగా చీలిపోయింద‌నంటంలో సందేహం లేదు. ఈ కొత్త ట్రెండ్ విభ‌జ‌న ప‌రిణామాల నేప‌థ్యంలో పుట్టుకొచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.